గోవా కాంగ్రెస్లో లుకలుకలు.. ఐదుగురు ఎమ్మెల్యేలు చెన్నైకి తరలింపు
- బీజేపీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న ప్రచారం
- సొంతపార్టీ నేతలే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపాటు
- అలాంటి ఆలోచనేదీ లేదన్న మైఖేల్ లోబో
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ సొంతపార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న మైఖేల్ లోబోను కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పదవి నుంచి తప్పించి, సంకల్ప్ అమోంకర్ను ఆ స్థానంలో నియమించింది. పార్టీలో తాజా పరిణామాలపై గోవా కాంగ్రెస్ ఇన్చార్జ్ దినేశ్ గుండూరావు స్పందించారు. బీజేపీతో కలిసి పార్టీని బలహీన పరిచేందుకు సొంతపార్టీ నాయకులే కుట్ర పన్నారని ఆరోపించారు. కాగా, బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను మైఖేల్ లోబో ఖండించారు. తమకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.