హైకోర్టులు, దిగువస్థాయి కోర్టుల్లో స్థానిక భాషలు వినియోగించాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
- జైపూర్ లో 18 ఆలిండియా లీగల్ సర్వీసెస్ సమావేశాలు
- కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- మన మాతృభాష తక్కువది అనే భావనను విడనాడాలన్న మంత్రి
అంతేకాదు, ఇంగ్లీషులో బాగా మాట్లాడే న్యాయవాదులకే ఎక్కువ కేసులు, ఫీజులు, గౌరవం అనే వాదన సరికాదని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క న్యాయస్థానం కూడా కేవలం ఉన్నత వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వరాదని, సమాన రీతిలో అన్ని వర్గాలకు న్యాయస్థానం తలుపులు తెరిచి ఉంచాలని హితవు పలికారు.
"సుప్రీం కోర్టులో వాదనలు, తీర్పులు ఎలాగూ ఆంగ్లంలోనే ఉంటాయి. కానీ, మా ఆలోచన ఏంటంటే... హైకోర్టులు, అంతకంటే దిగువ కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం" అని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.