వరంగల్లో కేసీఆర్... కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటిలో సమీక్ష
- వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన కేసీఆర్
- రాత్రికి వరంగల్లోనే బస చేయనున్న సీఎం
- ఆదివారం ఉదయం వరద ప్రాంతాల్లో పర్యటన
రాత్రికి వరంగల్లోనే బస చేయనున్న కేసీఆర్... ఆదివారం ఉదయం గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏటూరునాగారం తదితర వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద సహాయ కార్యక్రమాలు, ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై పరిశీలన జరపనున్నారు. ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం ఆదివారం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.