BJP: మోదీ చ‌ర్య‌ల‌తో రైతుల ఆదాయం రెట్టింపైంద‌న్న కేంద్రం.. ఎక్క‌డో చెప్పాలన్న కేటీఆర్‌

  • కేంద్ర వ్యవ‌సాయ శాఖ ప్ర‌క‌ట‌న‌పై వేగంగా స్పందించిన‌ కేటీఆర్
  • ఆ వివ‌రాల‌ను ప్ర‌ధాని ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని డిమాండ్
  • రెట్టింపు ఆదాయాన్ని సాధించిన రైతులు ఎన్ని ల‌క్ష‌ల మంది అని ప్ర‌శ్న‌
  • వారంతా ఎక్క‌డివారో, ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కం వారికి ఉప‌యోగ‌ప‌డిందో చెప్పాల‌ని డిమాండ్‌
ktr asks union government about the farmers who doubled their income

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన చ‌ర్య‌లు, దేశ రైతాంగానికి చేసిన సూచ‌న‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశ‌గా మోదీ చేసిన సూచ‌న‌లు పాటించిన రైతులు రెట్టింపు కంటే అధిక ఆదాయం రాబ‌ట్టార‌ని ఆ శాఖ తెలిపింది. ఇలా చాలా మంది రైతులు రెట్టింపు కంటే అధికాదాయం సంపాదిస్తున్నార‌ని ఆ శాఖ తెలిపింది. 

కేంద్ర వ్య‌వసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసినంత‌నే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ వేగంగా స్పందించారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌క‌ట‌న నిజ‌మే అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ వివ‌రాల‌ను దేశ ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రికి 3 ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

దేశంలో రెట్టింపు ఆదాయాన్ని సాధించిన రైతులు ఎన్ని ల‌క్ష‌ల మంది ఉన్నారో తెల‌పాల‌ని కేటీఆర్ కోరారు. ఈ రైతులు ఏఏ రాష్ట్రాల‌కు చెందిన వారో కూడా తెలపాల‌ని కోరారు. ఇలా రైతులు త‌మ ఆదాయాల‌ను రెట్టింపు చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డిన ప్ర‌భుత్వ ప‌థ‌కం ఏదో కూడా వెల్ల‌డించాల‌ని కేటీఆర్ కోరారు.

More Telugu News