ఢిల్లీలో దుబ్బాక ఎమ్మెల్యే... రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ శిక్షణ తరగతులకు హాజరు
- ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
- ఢిల్లీలో బీజేపీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ తరగతులు
- ఫొటోలను పంచుకున్న రఘునందన్ రావు
ఇలాంటి సమయంలో అధికార ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ... రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న దానిపై తన ప్రజా ప్రతినిధులకు బుధవారం శిక్షణ తరగతులను నిర్వహించింది. డిల్లీలో జరిగిన ఈ శిక్షణ తరగతులకు బీజేపీ ఎంపీలతో పాటు ఆ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందులో భాగంగా తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాధవనేని రఘునందన్ రావు కూడా ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. శిక్షణా తరగతుల ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.