Telangana: మ‌హంకాళీ బోనాల‌కు కేసీఆర్‌ను ఆహ్వానించిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

  • ఈ నెల 17, 18 తేదీల్లో మ‌హంకాళి బోనాలు
  • కేసీఆర్‌కు ఆహ్వ‌నం ప‌లికిన ఆల‌య క‌మిటీ
  • సికింద్రాబాద్ పరిధిలో వేడుక‌గా మ‌హంకాళి బోనాలు
kcr invited to mahankali bonalu

సికింద్రాబాద్ ప‌రిధిలో శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళీ దేవ‌స్థానం ఆధ్వర్యంలో జ‌రిగే బోనాల మ‌హోత్స‌వాల‌కు హాజ‌రు కావాలంటూ సీఎం కేసీఆర్‌కు బుధ‌వారం ఆహ్వానం అందింది. ఈ మేర‌కు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నేతృత్వంలో ఆల‌య కమిటీ చైర్మ‌న్ సూరిటి కామేశ్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డిలు కేసీఆర్‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు.

ఈ నెల 17,18 తేదీల్లో మ‌హంకాళి బోనాల ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఈ ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఈ సందర్భంగా ఆల‌య క‌మిటీ కేసీఆర్‌ను కోరింది. తెలంగాణ వ్యాప్తంగా అట్ట‌హాసంగా జ‌రిగే బోనాల ఉత్స‌వాల్లో మ‌హంకాళీ అమ్మ‌వారి బోనాలకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News