దక్షిణాఫ్రికాలోని బార్లో ఘాతుకం.. తుపాకి తూటాలకు 15 మంది బలి
- మినీ బస్సులో వచ్చిన సాయుధులు
- వచ్చీ రావడంతోనే కాల్పులు
- మరో 9 మంది పరిస్థితి విషమం
- కారణాలు తెలియరాలేదన్న పోలీసులు
- పీటర్మారిట్స్బర్గ్లో జరిగిన ఘటనలో నలుగురి మృతి
కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారింకా పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఘటనలు జరిగే దక్షిణాఫ్రికాలో ప్రతి సంవత్సరం 20 వేల మంది హత్యకు గురవుతుంటారు. కాగా, ఇలాంటి ఘటనే ఒకటి సొవెటోకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీటర్మారిట్స్బర్గ్లోనూ ఆదివారం జరిగింది. అక్కడి బార్లో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.