AP High Court: దుల్హ‌న్ ప‌థ‌కం ఆప‌డానికి కార‌ణాలేమిటో చెప్పండి.. ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

  • పేద మైనారిటీల వివాహానికి ఆర్థిక సాయం అందించే ప‌థ‌క‌మే దుల్హ‌న్‌
  • 2015లో అప్ప‌టి టీడీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం ప్రారంభం
  • తాజాగా ప‌థకాన్ని నిలిపివేస్తూ ప్ర‌భుత్వ నిర్ణయం
  • హైకోర్టును ఆశ్ర‌యించిన‌ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి 
ap high court asks  state government what are the reasons to stop dulhan scheme

నిరుపేద మైనారిటీల వివాహాలకు ప్రభుత్వం తరఫున రూ.50 వేలు అందజేస్తున్న దుల్హన్ పథకంపై ఏపీ హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. 2015లో అప్ప‌టి టీడీపీ ప్రభుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ ప‌థ‌కాన్ని నిలిపివేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఓ ద‌ఫా విచార‌ణ జ‌ర‌గ‌గా... గురువారం మ‌రో విడ‌త విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ‌లో భాగంగా దుల్హ‌న్ ప‌థ‌కాన్ని ఆపేశామ‌ని చెప్పారు క‌దా... అందుకు గ‌ల కార‌ణాలేమిటో చెప్పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వ న్యాయ‌వాదిని కోరింది. ఈ వివ‌ర‌ణ అంద‌జేసేందుకు త‌మ‌కు 4 వారాల గ‌డువు కావాల‌న్న ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించిన కోర్టు... విచార‌ణ‌ను 4 వారాల‌కు వాయిదా వేసింది.

More Telugu News