సూచనల కోసం వచ్చి.. వాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీని హత్య చేసిన దుండగులు
- హోటల్ లాబీలో అందరూ చూస్తుండగానే హత్య
- అడ్డుకునే ప్రయత్నం చేసిన హోటల్ సిబ్బంది
- ఆయుధాలు చూసి భయపడి వెనక్కి తగ్గిన వైనం
- గురూజీ శరీరంపై 39 కత్తిపోట్లు
- హత్య అనంతరం ఆయుధాలు చేపట్టుకుని పరారీ
ఆ తర్వాత ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా కత్తులతో ఆయన శరీరాన్ని తూట్లు పొడిచారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, వారి చేతుల్లో ఆయుధాలు ఉండడంతో దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు. రక్తపు మడుగులో కుప్పకూలిన గురూజీ మరణించినట్టు నిర్ధారించుకున్న దుండగులు చేతుల్లో కత్తులతోనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఆయన శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హోటల్ రిసెప్షన్లో ఉన్న సీసీకెమెరా ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. ఆయన హత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు. కాగా, బాగల్కోట్లో ఉండే చంద్రశేఖర్ గురూజీ వ్యక్తిగత పనుల నిమిత్తం హుబ్లీ వచ్చినట్టు తెలుస్తోంది.
వాస్తు నిపుణుడిగా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చంద్రశేఖర్ గురూజీ ఎన్నో టీవీ చానళ్లలో వాస్తుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సివిల్ ఇంజినీరింగ్తోపాటు కాస్మిక్ ఆర్కిటెక్చర్లో డాక్టరేట్ పొందిన ఆయన 2 వేలకు పైగా సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులు అందుకున్నారు. కాగా, హోటల్ రిసెప్షన్ వద్దనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన చంద్రశేఖర్ గురూజీ హత్య వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.