ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

  • చెన్నై ప‌ర్యట‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి
  • స్వామినాథన్ ఇంటికి వెళ్లిన వెంక‌య్య‌
  • వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఆరోగ్యంపై ఆరా
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌ను ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. మంగ‌ళ‌వారం చెన్నై ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన వెంక‌య్య... న‌గ‌రంలోని స్వామినాథ‌న్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. 

వ‌య‌సు రీత్యా గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న స్వామినాథ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై వెంక‌య్య ఆరా తీశారు.

Venkaiah Naidu
M S Swaminathan
Chennai

More Telugu News