జనసేన కౌలు రైతు భరోసాకు విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి
- జనసేన కౌలు రైతు భరోసాకు రూ.1.50 లక్షలిచ్చిన అంజనా దేవి
- జనసేనకు రూ.1లక్ష విరాళమిచ్చిన పవన్ తల్లి
- పవన్కు చెక్కులు అందజేసిన వైనం
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన తండ్రి ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో ఆయన పనిచేశారని, ఆయనకు వచ్చిన జీతంతోనే తామంతా పెరిగామని, 2007లో తన తండ్రి మరణించారని చెప్పారు. ఈ క్రమంలో తన తల్లికి ప్రభుత్వం పెన్షన్ అందిస్తోందని, ఆ సొమ్మును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు తన తల్లి ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.