Andhra Pradesh: ఈ నెల 27న అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌... త‌ల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్ర‌మే జ‌మ‌

amma vodi funds will release on27th of this month in andhra pradesh
  • ల‌క్ష మంది విద్యార్థుల‌ను అన‌ర్హులుగా గుర్తించిన ప్ర‌భుత్వం
  • గైర్హాజ‌రు కార‌ణంగా 51 వేల మంది విద్యార్థుల తొల‌గింపు
  • అమ్మ ఒడి కోసం ఈ ఏడాది రూ.6,500 కోట్ల నిధుల కేటాయింపు
ఏపీలో అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 27న విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో ఈ ప‌థ‌కం నిధుల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నుంది. అమ్మ ఒడి ప‌థ‌కం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల‌ను విడుద‌ల చేస్తున్న ప్ర‌భుత్వం.. ఈ ఏడాది మాత్రం రూ.13 వేల చొప్పున మాత్ర‌మే జ‌మ చేయ‌నుంది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించ‌లేదు. అమ్మ ఒడి ప‌థ‌కం కోసం ఈ ఏడాది రూ.6,500 కోట్ల‌ను కేటాయించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే... గ‌తేడాది అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది ల‌క్ష మందికి పైగా విద్యార్థుల‌ను అన‌ర్హులుగా తేల్చింది. పాఠశాల‌లకు గైర్హాజ‌రు కార‌ణంతో 51 వేల మంది విద్యార్థుల‌ను అన‌ర్హులుగా తేల్చిన అధికారులు... ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో మ‌రో 50 వేల మందిని జాబితా నుంచి తొల‌గించినట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
YSRCP
Amma Vodi

More Telugu News