Akash Puri: 100 కోట్ల డైమండ్ చుట్టూ తిరిగే కథనే 'చోర్ బజార్'

  • వినోదభరిత చిత్రంగా 'చోర్ బజార్'
  • మాస్ లుక్ తో కనిపించనున్న ఆకాశ్ పూరి 
  • కథానాయికగా గెహనా సిప్పీ పరిచయం 
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
Chor Bazaar movie update

ఆకాశ్ పూరి - గెహనా సిప్పీ కాంబినేషన్లో దర్శకుడు జీవన్ రెడ్డి 'చోర్ బజార్' సినిమాను రూపొందించాడు. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన థియేటర్లకు రానుంది. 

తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ .. "ఈ సినిమా కథను పూరి సార్ కి వినిపించడానికి వెళితే, నాపై గల నమ్మకంతో ఆయన కథను వినలేదు. ఈ సినిమా కథ అంతా కూడా 100 కోట్ల విలువైన ఒక డైమండ్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ డైమండ్ చోర్ బజార్ కి చేరుతుంది. అక్కడ ఎవరికీ కూడా దాని విలువ తెలియదు. పదికీ .. పాతికకి దానిని అమ్మడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.

ఇక ఈ సినిమాకి నైట్ ఎఫెక్ట్స్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి. 35 రోజుల పాటు రాత్రివేళలో షూటింగు చేశాము. ఆకాశ్ పూరి గొప్పగా చేశాడు. ఈ పాత్రకి ఆయన కరెక్ట్ అనిపించకమానదు. కంటెంట్ సరదాగా సాగిపోతూనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News