Andhra Pradesh: ఏపీలో శ్రీ సిమెంట్ భారీ పెట్టుబ‌డి... రూ.2,500 కోట్ల‌తో దాచేప‌ల్లి ప్లాంట్ విస్త‌ర‌ణ‌

  • దాచేపల్లిలో సిమెంట్ ప్లాంట్‌ను క‌లిగి ఉన్న శ్రీ సిమెంట్‌
  • దాని విస్త‌ర‌ణ‌కు రూ.2,500 కోట్లు వెచ్చించ‌నున్న కంపెనీ
  • అధికారికంగా ప్ర‌క‌టించిన శ్రీ సిమెంట్ లిమిటెడ్‌
Shree Cement Limited invests 2500 crore rupeesin andhra pradesh

ఏపీలో ఇప్ప‌టికే సిమెంట్ త‌యారీ ప్లాంట్‌ను క‌లిగి ఉన్న శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ తాజాగా రాష్ట్రంలో మ‌రో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని దాచేప‌ల్లిలో ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు ఓ సిమెంట్ త‌యారీ యూనిట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప్లాంట్‌ను భారీ ఎత్తున విస్త‌రించేందుకు శ్రీ సిమెంట్ ప్ర‌తిపాదించ‌గా... అందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి తెలిపింది.

ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఏపీలో త‌న తాజా పెట్టుబ‌డుల‌కు సంబంధించి శ్రీ సిమెంట్ మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం దాచేప‌ల్లి ప్లాంట్ విస్త‌ర‌ణ కోసం శ్రీ సిమెంట్ ఏకంగా రూ.2,500 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నుంది.

More Telugu News