Bars: ఏపీలో బార్లకు కొత్త పాలసీ... వివరాలు ఇవిగో!

  • మూడేళ్ల కాలావధితో బార్లకు తాజా లైసెన్సులు
  • నాన్ రిఫండబుల్ చార్జీలు 10 శాతం పెంపు
  • బార్ల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ దే తుది నిర్ణయం
  • ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్ రెండు నెలలు పొడిగింపు
New policy for bars in AP

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీ రూపురేఖలు మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని బార్లకు కొత్త పాలసీ ప్రకటించారు.

  • పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్ల, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలన్నది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు.
  • మున్సిపల్ కార్పొరేషన్ లో 10 కిలోమీటర్ల పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కిలోమీటర్ల పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
  • మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు.
  • బార్లకు లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడాదికి 10 శాతం పెంపు.
  • కొత్త బార్ పాలసీ సెప్టెంబరు 1 నుంచి అమలు.

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు వెలువరించారు. అటు, ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి బార్ల లైసెన్సులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, బార్ల లైసెన్సుల కాలపరిమితి జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు. లైసెన్సులు పొడిగించిన కాలానికి ప్రభుత్వం ఈ నెల 27న బార్ల నుంచి ఫీజులు వసూలు చేయనుంది.

More Telugu News