Andhra Pradesh: జులై 4న ఏపీకి ప్ర‌ధాని మోదీ రాక.. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌కు ప్రారంభోత్సవం

  • మంగ‌ళ‌గిరిలో నిర్మాణం పూర్తయిన ఎయిమ్స్‌
  • జులై 4న మోదీ చేతుల మీదుగా ప్రారంభం
  • మోదీ వెంట ఏపీకి కేంద్ర మంత్రి శోభా క‌రంద్లాజే
pm modi inaugurates mangalagiri aiims on july 4th

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జులై 4న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌ధాని అమ‌రావతి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరిలో నూత‌నంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో మోదీ వెంట కేంద్ర మంత్రి శోభా క‌రంద్లాజే కూడా ఏపీకి రానున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

ప్రధాని ఏపీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలోనే ఇటీవ‌లే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి ప‌రిశీలించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా ప‌రిశీలించారు. ఆమె ఇచ్చిన స‌మాచారంతోనే మోదీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన‌ట్లుగా తెలుస్తోంది.

More Telugu News