Bus: చార్ ధామ్ యాత్రలో విషాదం... బస్సు లోయలో పడి 17 మంది మృతి

  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • 28 మంది భక్తులతో వెళుతున్న బస్సు
  • భక్తులు మధ్యప్రదేశ్ కు చెందినవారు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన అమిత్ షా
Bus falls into gorge as 17 people died

చార్ ధామ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని వివరించారు.

More Telugu News