Kinnerasani: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న ‘కిన్నెరసాని’ చిత్రం

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'కిన్నెరసాని' 
  • జూన్ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్
  • థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన చిత్రం
  • రమణ తేజ దర్శకత్వం
Kinnersani movie will be released directly in ZEE 5 OTT App

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'కిన్నెరసాని' సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. 'కిన్నెరసాని' ఓటీటీ హక్కులను జీ 5 యాప్ సొంతం చేసుకుంది. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. రమణ తేజ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కిన్నెరసాని' జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

వేద అనే అమ్మాయి తన తండ్రి కోసం వెతకడం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. 

రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయస ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు రామ్ ప్రసాద్ నిర్మాత. ఎస్సార్టీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై 'కిన్నెరసాని' చిత్రాన్ని తెరకెక్కించారు.

More Telugu News