దావోస్ టూర్ ముగించుకుని ఏపీకి చేరిన సీఎం జగన్
- ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ సదస్సు
- సదస్సులో ఏపీ బృందానికి నేతృత్వం వహించిన జగన్
- మంగళవారం గన్నవరం చేరుకున్న జగన్
- స్వాగతం పలికిన మంత్రి జోగి, ఎమ్మెల్యే వల్లభనేని
ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరైన ఏపీ ప్రతినిధి బృందానికి స్వయంగా సీఎం జగనే నేతృత్వం వహించారు. ఈ నెల 26న దావోస్ సదస్సు ముగియగా... మంగళవారం జగన్ విజయవాడ చేరుకున్నారు.