యారాడ బీచ్పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్వీట్!
- పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్న నత్వానీ
- తన ట్వీట్కు బీచ్ వీడియోను ట్యాగ్ చేసిన వైనం
- కిషన్ రెడ్డి, రోజా ఖాతాలను ట్యాగ్ చేస్తూ నత్వానీ ట్వీట్
రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖకు అత్యంత సమీపంలో ఉండటంతో పాటుగా ఆహ్లాదకర వాతావరణాన్ని సొంతం చేసుకున్న ఈ బీచ్ పర్యాటకులను పరవశానికి గురి చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఈ బీచ్కు సంబంధించిన ఓ వీడియోను ట్యాగ్ చేసిన నత్వానీ... తన ట్వీట్ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ టూరిజం ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు.