రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
- ఇటీవల రోడ్డు ప్రమాదం
- కాలు విరగడంతో ఆసుపత్రిపాలైన రామయ్య
- అభిమానుల్లో ఆందోళన
- స్పందించిన పవన్ కల్యాణ్
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్టు వివరించారు పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పేర్కొన్నారు.
కాగా, తాను రోడ్డు ప్రమాదంలో గాయపడడానికి కారకుడైన బైకర్ పై వనజీవి రామయ్య పెద్దమనసు ప్రదర్శించారు. అతడిపై పోలీసు కేసు వద్దని, అతడితో 100 మొక్కలు నాటిస్తే చాలని సూచించారు.