Jeevan Reddy: అందుకే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌విత ఓడిపోయారు: జీవన్ రెడ్డి

  • షుగర్ ఫ్యాక్టరీ మూసివేసినందుకే ఓట‌మి అన్న జీవ‌న్ రెడ్డి
  • కాంగ్రెస్-బీజేపీ మ‌ధ్య‌ మ్యాచ్ ఫిక్సింగ్ అన‌డం స‌రికాద‌న్న కాంగ్రెస్ నేత‌
  • క‌విత‌ వ్యాఖ్య‌లు హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌
jeeven reddy slams trs

టీఆర్ఎస్ పార్టీ తీరుపై కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ఈ రోజు జగిత్యాలలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... షుగర్ ఫ్యాక్టరీ మూసివేసినందుకే గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత ఓడిపోయార‌ని ఆయ‌న అన్నారు. 

కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయంటూ ఆమె వ్యాఖ్య‌లు చేయ‌డం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీతో టీఆర్‌ఎస్ కుమ్మక్కైందని ఆయ‌న ఆరోపించారు. అస‌లు టీఆర్‌ఎస్ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ ఏదీ లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News