Subramanian Swamy: ఈ అంశంలో మోదీ విఫలమయ్యారు: సుబ్రహ్మణ్యస్వామి

  • మోదీపై సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు
  • ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయలేకపోయారని వెల్లడి
  • మోదీ చర్యలు తీసుకోలేకపోయారని వ్యాఖ్యలు
Subramanian Swmay criticizes PM Narendara Modi

అధికార బీజేపీలోనే ఉన్నప్పటికీ, అధినాయకత్వంపై విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడని సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. లోక్ సభలో పూర్తి మెజారిటీతో, రాజ్యసభలో వాస్తవ మెజారిటీతో 8 ఏళ్లు ప్రధానిగా ఉన్నా గానీ, ప్రార్థనా స్థలాల చట్టం-1991ని ఉపసంహరించుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ చట్టం రద్దు కోసం పార్లమెంటు నిర్ణయం తీసుకునేలా మోదీ కీలకపాత్ర పోషిస్తారని ఆశిస్తే, ఆ విషయంలో విఫలమయ్యారని తెలిపారు.

More Telugu News