యుద్ధం ముగియకున్నా... 18న కీవ్లో భారత ఎంబసీ పునఃప్రారంభం
- మార్చి 13న కీవ్ నుంచి భారత ఎంబసీ వార్సాకు తరలింపు
- ఇప్పటికీ కీవ్ను స్వాధీనం చేసుకోలేకపోయిన రష్యా
- కీవ్ కేంద్రంగా రాయబార కార్యకలాపాల పునరుద్ధరణకు దేశాల ఆసక్తి
- అదే బాటలో సాగుతున్న భారత్
ఇదిలా ఉంటే..రెండు నెలలుగా ఉక్రెయిన్పై బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా ఇప్పటిదాకా కీవ్ను స్వాధీనం చేసుకోలేకపోయింది. ఈ కారణంగానే ఆ నగరంపై బాంబుల మోత మోగించిన రష్యా...నగరంలోని మెజారిటీ ప్రాంతాల్లో భవనాలను కూల్చేసింది.
రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అప్పటిదాకా కీవ్ కేంద్రంగా కొనసాగుతున్న ఉక్రెయిన్లోని భారత ఎంబసీని మార్చి 13న పోలండ్ రాజధాని వార్సాకు భారత్ తరలించింది. అయితే ఇప్పుడు చాలా దేశాలు కీవ్ నుంచే కార్యకలాపాలు నిర్వహించే దిశగా సాగుతున్న నేపథ్యంలో భారత్ కూడా కీవ్లో తన ఎంబసీని ఈ నెల 18న ప్రారంభించాలని నిర్ణయించింది.