బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైర్
- రూపాయికి భరోసా లేదన్న సుమన్
- అధిక ధరలకు అంతం లేదని వ్యాఖ్య
- చీకట్లో దేశం, వెలుగుల్లో ఆదానీ, అంబానీలంటూ విమర్శ
- ప్రభుత్వ సంస్థలకూ గ్యారెంటీ లేదన్న సుమన్
రూపాయికి భరోసా లేదన్న బాల్క సుమన్.. అధిక ధరలకు అంతం లేదంటూ ఆరోపించారు. జీడీపీ నేల చూపులు చూస్తోంటే... ఆర్థిక వ్యవస్థ ఆగమై పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం చీకట్లో మగ్గిపోతోంటే... అదానీ, అంబానీలు వెలిగిపోతున్నారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. యువతకు ఉద్యోగాల్లేవని... ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ లేదని ఆయన విసుర్లు సంధించారు. కమాల్ మోడీ .. ఢమాల్ ఇండియా పేరిట దేశంలో బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుందని ఆయన దెప్పి పొడిచారు.