Telangana: త‌మిళ‌నాడు పర్యటనకు తెలంగాణ బీసీ క‌మిష‌న్‌ సభ్యులు... ఎందుకోస‌మంటే!

  • రిజ‌ర్వేష‌న్ల శాతాన్ని పెంచే దిశ‌గా తెలంగాణ స‌ర్కారు
  • త‌మిళ‌నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు
  • త‌మిళ‌నాడు స్థితిగ‌తుల ప‌రిశీల‌న‌కే బీసీ క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న‌
  • మూడు రోజుల పాటు కొన‌సాగ‌నున్న ప‌ర్య‌ట‌న‌
telangana bc commisiion tour in tamilnadu from tomorrow

తెలంగాణ బీసీ క‌మిష‌న్ బుధ‌వారం త‌మిళ‌నాడు రాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. రేప‌టి నుంచి మూడు రోజుల పాటు త‌మిళ‌నాడు రాష్ట్రంలో తెలంగాణ బీసీ క‌మిష‌న్ ప‌ర్య‌టించ‌నుంది. ఈ మేర‌కు బీసీ క‌మిష‌న్ స‌భ్యుడు కిశోర్ గౌడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

ఏ రాష్ట్రంలో అయినా రిజ‌ర్వేష‌న్ల శాతం 50కి మించ‌రాద‌న్న నిబంధ‌న ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నిబంధ‌న కార‌ణంగా మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచేందుకు తెలంగాణ‌కు అవ‌కాశం చిక్క‌డం లేదు. అదే విధంగా బీసీల్లో పెరిగిన జ‌నాభా దామాషా ప్ర‌కారం ఆ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ల శాతాన్ని పెంచే దిశ‌గానూ కేసీఆర్ స‌ర్కారుకు వీలు ప‌డ‌టం లేదు. దీంతో ఇత‌ర రాష్ట్రాల్లో రిజ‌ర్వేష‌న్ల ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న అంశంపై కేసీఆర్ స‌ర్కారు దృష్టి సారించింది.

ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులో 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్నాయి. ఏకంగా ఆ రాష్ట్రంలో 69 శాతం మేర రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్నాయి. ఈ దిశ‌గా 50 శాతానికి మించి అద‌నంగా 19 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను త‌మిళ‌నాడు ఎలాంటి న్యాయ వివాదా‌లు రాకుండా ఎలా అమ‌లు చేస్తున్న‌ద‌న్న దానిపై అధ్య‌య‌నానికి తెలంగాణ స‌ర్కారు సిద్ధ‌ప‌డింది. ఇందులో భాగంగా బీసీ క‌మిష‌న్‌ను ఈ అధ్య‌య‌నం కోసం త‌మిళ‌నాడు పంపుతోంది. త‌మిళ‌నాడులో జ‌ర‌పనున్న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ రాష్ట్రంలో నిర్దేశిత ప‌రిమితికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్న తీరుపై తెలంగాణ బీసీ క‌మిష‌న్ స‌మ‌గ్ర అధ్య‌య‌నం జ‌రప‌నుంది.

More Telugu News