Rajnath Singh: అడివి శేష్ 'మేజర్' ట్రైలర్ చూసిన రాజ్ నాథ్ సింగ్... చిత్రబృందానికి అభినందనలు

  • ముంబయి ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం
  • ఆయన జీవితకథతో మేజర్ చిత్రం
  • మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ 
  • మే 9న ట్రైలర్ రిలీజ్
  • రాజ్ నాథ్ కు ముందే చూపించిన చిత్రబృందం
Rajnath Singh watches Adivi Sesh starred Major cinema trailer

ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకుడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించాడు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

కాగా, ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చూపించింది. మేజర్ ట్రైలర్ ను వీక్షించిన రాజ్ నాథ్... చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ఈ సందర్భంగా మేజర్ చిత్ర స్లోగన్ ను విడుదల చేశారు. వాస్తవానికి మేజర్ చిత్రం ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కానుంది. అయితే, కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు ట్రైలర్ ను ముందే చూపించారు. ఈ చిత్రం జూన్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

More Telugu News