Duggirala: దుగ్గిరాల వైస్ ఎంపీపీలుగా టీడీపీ, జ‌న‌సేన ఎంపీటీసీలు

  • టీడీపీ నుంచి షేక్ జ‌బీన్, జ‌న‌సేన నుంచి సాయి చైత‌న్య‌
  • ఇద్ద‌రూ ఎన్నికైన‌ట్లు ప్ర‌కటించిన అధికారులు
  • ప్ర‌శాంతంగా ముగిసిన దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌లు

దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్ష ఎన్నిక‌లు ఎట్ట‌కేల‌కు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ఎన్నిక‌ల కమిష‌న్ నోటిఫికేష‌న్ మేర‌కు గురువారం దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో కో ఆప్ష‌న్ మెంబ‌ర్‌,  ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ ప‌ద‌వుల‌కు ఎన్నికలు జ‌రిగాయి. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఎన్నిక‌లు పూర్తయ్యాయి. 

దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ ఉపాధ్య‌క్ష ప‌ద‌వులు రెండు ఉండ‌గా...వాటిలో ఓ ప‌దవిని టీడీపీ ద‌క్కించుకోగా, ఇంకో ప‌ద‌విని జ‌న‌సేన చేజిక్కించుకుంది. టీడీపీ ప్ర‌తిపాదించిన షేక్ జ‌బీన్, జ‌న‌సేన ప్ర‌తిపాదించిన ప‌సుపులేటి సాయి చైత‌న్య‌లు వైస్ ఎంపీపీలుగా ఎన్నికైన‌ట్లు కాసేప‌టి క్రితం అధికారులు ప్ర‌క‌టించారు. 

దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్‌కు సంబంధించి గురువారం మొత్తం నాలుగు ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా...వాటిలో రెండింటిని విప‌క్ష టీడీపీ గెలుచుకోగా.. అధికార వైసీపీ, జ‌న‌సేన చెరో ప‌ద‌విని ద‌క్కించుకున్నాయి. ఎంపీపీ ప‌ద‌విని వైసీపీ చేజిక్కించుకోగా.. జ‌నసేన వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకుంది. ఇక ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన టీడీపీ మాత్రం వైస్ ఎంపీపీ ప‌ద‌వితో పాటు కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ప‌ద‌విని కూడా ద‌క్కించుకుంది.

More Telugu News