K Kavitha: రాహుల్ గాంధీ, జేపీ నడ్డాల పర్యటనలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

Kavitha comments on Rahul Gandhi and JP Nadda visits
  • తెలంగాణలో పర్యటించనున్న రాహుల్, జేపీ నడ్డా
  • తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారన్న కవిత
  • రాష్ట్రానికి వీరు చేసిందేమీ లేదని వ్యాఖ్య
తెలంగాణలో అప్పుడే ఎన్నికల సమయం ఆసన్నమయిందా? అనే విధంగా రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. పాదయాత్రలు, సభలు, పర్యటనలను, ప్రెస్ మీట్లతో అన్ని పార్టీల నేతలు హీట్ పెంచుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వీరిపై విమర్శలు గుప్పించారు. 

తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారంటూ కవిత ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రానికి వస్తుంటారని.. రాష్ట్రానికి వీరు చేసిందేమీ ఉండదని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ కేవలం రాజకీయాల కోసమేనని విమర్శించారు. రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కవిత మండిపడ్డారు.
K Kavitha
TRS
Rahul Gandhi
Congress
JP Nadda
BJP

More Telugu News