Chandrababu: మహిళలపై దాడులు, రైతుల ఆత్మహత్యలపై పార్టీ నేతలతో కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయం

Chandrababu decides to deploy committees on atrocities over women and farmers suicides
  • పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
  • మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై చర్చ
  • కమిటీల ద్వారా పోరాడాలని నిర్ణయం
  • వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని వ్యాఖ్యలు
పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, మహిళల మీద అఘాయిత్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో, మహిళలపై దాడులు, రైతుల ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక్క ఏప్రిల్ లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయని అన్నారు. పరిశ్రమలు రాక, ఉపాధి లేక యువత వలసపోతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు.
Chandrababu
Committees
Women
Farmers
TDP
Andhra Pradesh

More Telugu News