Yanamala: న‌వ ర‌త్నాలు కాదు.. న‌వ మోసాలు: య‌న‌మ‌ల‌

  • జ‌గ‌న్ పాల‌న 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోంది
  • మూడేళ్ల‌లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం జ‌గ‌న్‌ది
  • సంక్షేమ ప‌థ‌కాల‌ను అవినీతిమ‌యం చేశారన్న‌ య‌న‌మ‌ల
yanamala slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ది న‌వ ర‌త్నాలు కాదని, న‌వ మోసాలని ఆయ‌న అన్నారు. 

జ‌గ‌న్ పాల‌న 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోందని ఆయ‌న చెప్పారు. మూడేళ్ల‌లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం జ‌గ‌న్ దేన‌ని ఆయ‌న అన్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అవినీతిమ‌యం చేశారని ఆయ‌న ఆరోపించారు. హామీలు అమ‌లు చేయ‌ని జ‌గ‌న్ పై గ్రామ‌గ్రామాన చ‌ర్చ జ‌రుగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

More Telugu News