Corona Virus: ఏపీలో తాజాగా ఐదుగురికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 4,169 కరోనా పరీక్షలు
  • విశాఖ జిల్లాలో 3 కొత్త కేసులు
  • కొత్త మరణాలు నిల్ 
Five people tested corona positive

ఏపీలో గడచిన 24 గంటల్లో 4,169 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో ముగ్గురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 14,730 మంది కరోనాతో మృతి చెందారు.
.

More Telugu News