AP Governor: రాజ్‌భ‌వ‌న్‌కు సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన గ‌వర్న‌ర్‌తో భేటీ

  • ఢిల్లీలో ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రితో గ‌వ‌ర్న‌ర్ భేటీ
  • ఢిల్లీ టూర్‌ను ముగించుకుని వ‌చ్చిన గ‌వర్న‌ర్‌
  • గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన సీఎం జ‌గ‌న్‌
ap cm ys jagan meets governor

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లారు. రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. విశాఖ ప‌ర్య‌ట‌న ముగించుకుని తాడేప‌ల్లి చేరుకున్న కాసేప‌టికే జ‌గ‌న్ రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌తో సమావేశమయ్యారు. 

ఇటీవ‌లే గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా గ‌వ‌ర్న‌ర్ క‌లిశారు.

More Telugu News