TDP: నారా లోకేశ్‌పైకి రాళ్లు విసిరిన‌ వైసీపీ శ్రేణులు.. దుగ్గిరాల‌లో హైటెన్ష‌న్‌

  • హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన లోకేశ్
  • పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న వైసీపీ శ్రేణులు
  • టీడీపీ, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం, తోపులాట‌
  • నారా లోకేశ్, టీడీపీ శ్రేణుల‌పై రాళ్లు విసిరిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు
  • లోకేశ్‌కు అత్యంత స‌మీపంలో ప‌డిన పెద్ద రాయి

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం తుమ్మ‌పూడిలో గురువారం సాయంత్రం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. విప‌క్ష టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణుల‌పై అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడికి దిగారు. హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేశ్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ గొడ‌వ జ‌రిగింది.

హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేశ్ వ‌చ్చార‌ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుచ‌రులు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆ త‌ర్వాత వైసీపీ శ్రేణులు నారా లోకేశ్‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పైకి రాళ్లు రువ్వ‌డం మొద‌లుపెట్టాయి. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ నిలుచున్న చోటే... ఆయనకు అతి స‌మీపంలోనే పెద్ద రాయి వ‌చ్చి ప‌డింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో లోకేశ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేదు.

More Telugu News