G. Kishan Reddy: సింగ‌రేణి కార్మికుల‌తో కలిసి కిష‌న్ రెడ్డి భోజ‌నం... సింగ‌రేణిని ప్రైవేట్ ప‌రం చేయ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌

  • సింగ‌రేణిలో ప‌ర్య‌టించిన కిష‌న్ రెడ్డి
  • సింగ‌రేణి కార్మికులను ఉద్దేశించి ప్రసంగం 
  • ఆ ఆలోచ‌నే కేంద్రం వ‌ద్ద లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
kishan reddy visits singareni

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోమ‌వారం సింగ‌రేణిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సింగ‌రేణి కార్మికుల‌తో క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. ఆ త‌ర్వాత సంస్థ కార్మికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సింగ‌రేణిని కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేట్ ప‌రం చేస్తున్నంద‌న్న వార్త‌ల్లో వాస్తవం లేద‌ని చెప్పారు. సింగ‌రేణిని ప్రైవేట్ ప‌రం చేసే ఆలోచ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి లేద‌ని కూడా కిష‌న్ రెడ్డి చెప్పారు. ఈ దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న కార్మికుల‌కు పిలుపునిచ్చారు.

More Telugu News