బెయిల్ లభించిన కాసేపటికే జిగ్నేశ్ మేవానీ మళ్లీ అరెస్ట్
- మోదీపై వ్యాఖ్యల కేసు ఎదుర్కొంటున్న మేవానీ
- గత గురువారం పలన్ పూర్ లో అరెస్ట్
- బెయిల్ ఇచ్చిన కోక్రాఝార్ కోర్టు
- ఈసారి మేవానీని అదుపులోకి తీసుకున్న బార్పెట్టా పోలీసులు
అసోంలోని బార్పెట్టాకు చెందిన పోలీసులు మేవానీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మళ్లీ ఎందుకు అరెస్ట్ చేశారన్న దానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే, ఓ ప్రభుత్వ అధికారి విధులకు అడ్డం తగిలారన్న కేసులో జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా, తనను అసోం పోలీసులు అరెస్ట్ చేయడంపై మేవానీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. "ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల కుట్ర. నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇదంతా చేశారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారు. గతంలో రోహిత్ వేములకు కూడా ఇలాగే జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ కు ఇలాగే జరిగింది. ఇప్పుడు వాళ్లు నన్ను టార్గెట్ చేశారు" అని వ్యాఖ్యానించారు.