Mancherial District: 11 నెల‌ల కొడుకును నేల‌కేసి కొట్టి చంపిన కిరాత‌క తండ్రి

  • మంచిర్యాల జిల్లాలో ఘ‌ట‌న‌
  • కుటుంబ క‌లహాలే నేప‌థ్యం
  • విచార‌ణ ప్రారంభించిన పోలీసులు

స‌మాజంలో నేర ప్ర‌వృత్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ర‌క్త సంబంధీకులే కాదు..క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌పైనా కొంద‌రు అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో మరింత‌గా పెరిగిపోతున్న వైనం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంద‌నే చెప్పాలి. ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఏడాది వ‌య‌సు కూడా నిండ‌ని చిన్నారి కొడుకును అత‌డి తండ్రే అత్యంత కిరాత‌కంగా చంపేశాడు.

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ తండ్రి త‌న 11 నెల‌ల వ‌య‌స్సున్న కుమారుడిని నేల‌కేసి కొట్టి చంపేశాడు. ఈ ఘ‌ట‌న‌ను చూసిన స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురై వెనువెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెనువెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలోనే ఆ తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడ‌ని పోలీసులు తేల్చారు.

More Telugu News