Andhra Pradesh: విజయవాడలో నడిరోడ్డుపై విద్యార్థినుల సిగపట్లు.. వీడియో ఇదిగో

  • కేబీఎన్ కాలేజీ గేటు బయట ఘటన
  • వద్దని వారించినా ఆగని అమ్మాయిలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Two Girls Fight On Road

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు సిగపట్లు పట్టారు. నడిరోడ్డు మీద నలుగురూ చూస్తున్నా జుట్లు పట్టుకుని బాహాబాహీకి దిగారు. వన్ టైన్ లోని కేబీఎన్ కాలేజీ సమీపంలో గేటు బయట ఈ ఘటన జరిగింది. కారణమేంటో తెలియదుగానీ.. ఆ ఇద్దరు మాత్రం పిడిగుద్దులతో ముష్టి యుద్ధం చేసుకున్నారు. అక్కడున్న వారు వారించినా, వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అయితే, ఎవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిపోయింది. 

More Telugu News