Santhosh Sobhan: 'ఆచార్య' ప్రీ రిలీజ్ వేదికపై 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ రిలీజ్!

  • అవినీతిపై శంఖం పూరించే 'ఆచార్య'
  • ఈ నెల 23వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చిరూ కూతురు సొంత బ్యానర్లో 'శ్రీదేవి శోభన్ బాబు'
  • 'ఆచార్య' స్టేజ్ పైనే సుస్మిత సందడి కూడా
Sridevi Sobhan Babu Movie Update

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుండి. మణిశర్మ స్వరపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 'ఆచార్య'తో ఈ సినిమాకేంటి సంబంధం అంటే, ఇది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన సినిమా కావడమే!

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో కథానాయికగా గౌరీ పరిచయమవుతోంది. కమ్రన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, 'ఆచార్య' వేదిక ద్వారా వచ్చే ట్రైలర్ కి ఎక్కువ మైలేజ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

More Telugu News