కేంద్రానికి తెలంగాణ లేఖ.. రా రైస్ కొనాలని విజ్ఞప్తి
- కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్
- బాయిల్డ్ రైస్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడి
- బియ్యం ప్యాకింగ్ కోసం 15 కోట్ల బస్తాలు కావాలని విజ్ఞప్తి
తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాసిన ఈ లేఖలో తమ నుంచి రా రైస్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా ఒకవేళ బాయిల్డ్ రైస్ కావాలన్నా కూడా ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆ లేఖలో తెలంగాణ తెలిపింది. ఇక బియ్యం ప్యాకింగ్ కోసం 15 కోట్ల బస్తాలు కావాల్సి ఉందని.. ఆ మేరకు బస్తాల సరఫరాకు సహకరించాలని ఆ లేఖలో కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.