Nellore: నెల్లూరు కోర్టులో చోరీ కేసులో నిందితుల గుర్తింపు... ఇద్ద‌రి అరెస్ట్‌

  • నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల‌ను చోరీ చేసిన వైనం
  • కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
  • ఐదుగురు నిందితుల్లో ఇద్ద‌రి అరెస్ట్‌
  • మిగిలిన ముగ్గురి కోసం పోలీసుల ముమ్మ‌ర వేట‌

ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌నల‌కు తెర తీసిన నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించిన వ్య‌వ‌హారంలో పోలీసులు పురోగ‌తి సాధించారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కూడా మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి పాల్ప‌డింది ఐదుగురు వ్యక్తుల‌ని పోలీసులు తేల్చారు. 

నిందితులెవ‌ర‌న్న విష‌యంపై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన పోలీసులు మ‌రుక్ష‌ణ‌మే వారి కోసం వేట ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితులు పోలీసుల‌కు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... మిగిలిన నిందితుల కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్‌తో ఈ చోరీ వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిట‌న్న‌ది తెలియ‌రానుంది.

More Telugu News