Santhosh Shobhan: సాయితేజ్ చేతుల మీదుగా 'శ్రీదేవి శోభన్ బాబు' నుంచి ఫస్టు సింగిల్!

  • విభిన్న కథా చిత్రంగా 'శ్రీదేవి శోభన్ బాబు'
  • సంతోష్ శోభన్ సరసన నాయికగా గౌరీ 
  • నిర్మాతగా చిరంజీవి కూతురు సుస్మిత 
  • దర్శకుడిగా ప్రశాంత్ కుమార్  
 Sridevi Sobhan Babu Movie Update

సంతోష్ శోభన్ హీరోగా 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా రూపొందింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సుస్మిత నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో గౌరీ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. సాయితేజ్ చేతుల మీదుగా రేపు సాయంత్రం 5 గంటలకు 'నిన్ను చూశాకా' అనే సాంగ్ ను రిలీజ్ చేయిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఫస్టు సింగిల్ తోనే మరింతగా ఈ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

యూత్ లో సంతోష్ శోభన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే తను మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులు వచ్చాయి' సినిమా చేశాడు. ఈ సినిమా యూత్ కి బాగానే కనెక్ట్ అయింది. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తొలిసారిగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందన్నది చూడాలి.

More Telugu News