పెట్రో ధరలు తగ్గించాలన్న బీజేపీ ఎంపీ.. కారణం కూడా చెప్పిన వైనం
- ఈ ఏడాది జనవరి 31 నాటి ధరలను ప్రస్తావించిన ఎంపీ
- ముడి చమురుతో పెట్రోల్, డీజిల్ ధరలను పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి
- ముడి చమురు ధరలు తగ్గినందున పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
ఈ ఏడాది జనవరి 31న పెట్రోల్,. డీజిల్ ధరలు ఏ మేర ఉన్నాయో..ఆ మేర ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరాయించారు. ఈ ఏడాది జనవరి 31న అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్లకు దిగువన ఉన్నాయని చెప్పిన స్వామి.. ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అంతే ఉన్నాయని వెల్లడించారు. ఈ కారణంగానే ఈ ఏడాది జనవరి 31న ఉన్న ధరల మేరకే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.