Telangana: రేపు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ భేటీ

  • కేంద్ర ప్ర‌భుత్వానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన కేసీఆర్
  • ఆయా అంశాల‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌
  • ధాన్యం కొనుగోళ్ల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న కేబినెట్‌
telangana cabinet to meet tomorrow

కేంద్ర స‌ర్కారుపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, అన్న‌దాతలు సిద్ధంగా ఉన్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్‌ డిమాండ్ చేశారు. 

ఆయా అంశాల‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు రేపు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్ల‌పై ఈ భేటీలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్ల‌ర్ల‌కు విక్ర‌యించే అంశం, ధాన్యం నిల్వ‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News