టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబం తిరుమల విచ్చేసి మొక్కులు తీర్చుకుంది. రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రాజశేఖర్ కుటుంబ సభ్యుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.