TRS: ధాన్యం కొనుగోళ్ల‌పై 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిర‌స‌న‌

  • ఢిల్లీలోని టీఆర్ఎస్ కార్యాల‌యంలో దీక్ష‌
  • స్థ‌లాన్ని ప‌రిశీలించిన పార్టీ ఎంపీలు
  • యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేన‌ని డిమాండ్‌
trs deeksha on 11th in delhi

తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనే ఈ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం కూడా తెలంగాణ ప్ర‌జ‌లు కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ ఇళ్ల‌పై న‌ల్ల జెండాలు ఎగుర‌వేయాల‌ని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే ధ‌ర్నాకు దిగ‌నున్న‌ట్లుగా  టీఆర్ఎస్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఢిల్లీలో ఈ నెల 11న నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్టు టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగే ఈ నిర‌స‌న దీక్ష‌కు సంబంధించిన స్థ‌లాన్ని పార్టీ ఎంపీలు శుక్ర‌వారం ప‌రిశీలించారు.

More Telugu News