18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్.. ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ
- ఆదివారం నుంచి పంపిణీ షురూ
- ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నేపథ్యంలో ప్రకటన
- ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీపై విమర్శలు
18 ఏళ్లు పైబడ్డ వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 10 (ఆదివారం) నుంచి బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. బూస్టర్ డోస్ పంపిణీని ప్రైవేట్ కేంద్రాల ద్వారా చేయనున్నట్టు కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.