Telangana: తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం భేటీ

  • కేటీఆర్ దంపతులను కలిసిన సంగ్మా దంపతులు
  • శాలువా కప్పి సత్కరించిన కేటీఆర్ దంపతులు
  • రెండు రాష్ట్రాల అంశాలపై చర్చ
Meghalaya CM Conrad Sangma Meets KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. ఇవాళ ప్రగతి భవన్ లో కేటీఆర్, శైలిమ దంపతులను సంగ్మా దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని సంగ్మా ప్రకటించగా.. సంగ్మాతో సమావేశమవడంపట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News