ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన టాలీవుడ్ నటుడు మహేశ్బాబు
- 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్
- అభిమానులతో పంచుకున్న నమ్రత
- ఏపీ గవర్నర్, ఆంధ్రా ఆసుపత్రికి నమ్రత కృతజ్ఞతలు
- మహేశ్బాబుపై కురుస్తున్న ప్రశంసల వర్షం
ఈ సందర్భంగా మహేశ్ ఉదారతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు గ్రేట్ అని కొనియాడుతున్నారు. ఎంబీ ఫౌండేషన్ పేరుతో మహేశ్బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు. కాగా, మహేశ్బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.