గంట‌కు పైగా మోదీతో భేటీ.. జ‌గ‌న్ ఏమేం చ‌ర్చించారంటే..!

ap cm ys jagan meeting with pm modi concludes
  • మోదీతో ముగిసిన జ‌గ‌న్ భేటీ
  • కొత్త జిల్లాల ఏర్పాటును వివ‌రించిన జ‌గ‌న్‌
  • తెలంగాణ బ‌కాయిల‌పై కూడా జ‌రిగిన చ‌ర్చ‌
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భేటీ కాసేప‌టి క్రితం ముగిసింది. నేటి మధ్యాహ్నం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌... రాజధాని చేరుకున్న వెంట‌నే సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట‌కు పైగా ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ భేటీలో జ‌గ‌న్ ప‌లు కీల‌క అంశాల‌ను మోదీ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని మోదీకి వివ‌రించిన జ‌గ‌న్‌.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కూడా వివ‌రించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రస్తుత ప‌రిస్థితిని ప్ర‌ధానికి వివ‌రించిన జ‌గ‌న్‌.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు పెండింగ్ అంశాల‌పై కూడా చ‌ర్చించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును మ‌రోమారు ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిల గురించి కూడా మోదీకి వివ‌రించిన‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
YS Jagan
Prime Minister
Narendra Modi
Delhi Tour

More Telugu News